ట్రంప్ కీలక నిర్ణయం.. ఆందోళనలో విద్యార్థులు - కొత్త రూల్స్, కొత్త వీసా స్లాట్లు! అలాంటి వాళ్లకి అమెరికాలో చోటు లేదు!
Fri May 30, 2025 12:13 U S A
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఇప్పటికే సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువులను వాయిదా వేసుకోగా.. ఎలాగోలా నెట్టుకొద్దామని సిద్ధమైన వారికీ తాజాగా మరో గండం వచ్చిపడింది. పరిస్థితులు మారతాయన్న ఆశతో కొందరు.. పార్టమ్ ఉద్యోగాలు అవసరం లేదని, చదువుకే ప్రాధాన్యమని మరికొందరు.. ఇలా క్లిష్టపరిస్థితుల్లో ధైర్యం చేసి అగ్రరాజ్యంలో చదువుకు సై అన్న వారిలో దాదాపు సగం మందిని వీసాల తాత్కాలిక నిలిపివేత నిర్ణయం షాక్కు గురిచేస్తోంది. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా.. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ స్లాట్లు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో వచ్చే ఆగస్టు/సెప్టెంబరులలో తరగతులు మొదలయ్యే ఫాల్ సీజన్కే 90 శాతం మంది భారతీయ విద్యార్థులు వెళ్తుంటారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!
అందుకు ఫిబ్రవరి, మార్చి నుంచే ఆ దేశ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటారు. సీటు ఇస్తామని ఐ-20 పత్రాన్ని వర్సిటీ పంపిన తర్వాత విద్యార్థులు ఎఫ్-1 వీసా కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు. 'ఓపెన్ డోర్' నివేదిక ప్రకారం 2023-24లో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్తో ప్రథమ స్థానం. ఏటా మన దేశం నుంచి వెళ్లే వారిలోనూ 40 వేల నుంచి 50 వేల మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండేవారు. అక్రమ వలసదారులను పట్టుకొని వారి సొంత దేశాలకు పంపాలన్న లక్ష్యంతో గత జనవరి/ఫిబ్రవరి నుంచి అమెరికా దాడులు చేయడంతో పార్టమ్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వాటిని మానుకున్నారు. అక్కడ ఉద్యోగాలు బాగా తగ్గాయని అంచనాకు వచ్చి.. ఏటా వెళ్లేవారిలో 50 శాతం అమెరికా చదువును వాయిదా వేసుకున్నారు. మిగిలిన సగం మంది మాత్రం ఎలాగోలా అక్కడికి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఐ-20 పత్రాన్ని పొందిన విద్యార్థులు మే మొదటి వారం నుంచి వీసా తేదీని బుక్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటికే వెళ్లే వారిలో దాదాపు సగం మంది వీసా స్లాట్లను బుక్ చేసుకున్నారని నిపుణుల అంచనా. అంటే వారికి సమస్య లేదని చెబుతున్నారు. కాకపోతే వీసా తిరస్కరిస్తారేమో అన్న ఆందోళన వారిలోనూ ఉంది. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి వీసా తిరస్కరణ చాలా తగ్గిందని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. 'మా కన్సల్టెన్సీ నుంచి 14 మంది వీసా కోసం వెళ్లారు. వారిలో ఒకరిది మాత్రమే తిరస్కరించారు' అని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్ ఎండీ ఉడుముల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం తరగతుల ప్రారంభ తేదీకి నెల రోజుల ముందు అమెరికాకు వెళ్లొచ్చని.. ఈ సారి వీసాల జారీ ఆలస్యమైతే ఆ సమయం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 29 మందికి గాయాలు!
వీసాకు దరఖాస్తు ఫారమైన డీఎస్-160 ద్వారా 2011-12 నుంచే సోషల్ మీడియా ఖాతాల వివరాలను అడుగుతూనే ఉన్నారు. కాకపోతే అందరి ఖాతాలను త్వరగా తనిఖీ చేసే విధానం లేదు. అమెరికాకు వ్యతిరేకంగా అక్కడి కొన్ని వర్సిటీల్లో పాలస్తీనా తదితర దేశాల వారు ఆందోళనలు చేస్తుండటంతో అలాంటి వారిని ముందుగా కనిపెట్టి అమెరికాలో అడుగు పెట్టకుండా నిలువరించాలని ట్రంప్ భావిస్తున్నారు. దాంతో ఇక నుంచి కొత్త వీసా స్లాట్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్లలో ఈ ప్రక్రియను నిలిపివేసినందున సాధ్యమైనంత త్వరగా కొత్త విధానాన్ని తీసుకొస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 'వీసాల జారీ కొంత ఆలస్యం కావొచ్చు. భారతీయ విద్యార్థులు.. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోని వారు అమెరికాకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చాలా అరుదు. అందువల్ల మన విద్యార్థులకు ఎటువంటి నష్టమూ ఉండదు' అని గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు శుభాకర్ అభిప్రాయపడ్డారు. మరో 10-15 రోజుల్లోనే మళ్లీ వీసా స్లాట్లు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ చదువుకుందామనుకునే వారు అమెరికాకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉత్తమ వర్సిటీలను ఎంచుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు కూడా సులభతరమవుతాయని సూచిస్తున్నారు. 'నేను నాలుగున్నర నెలలపాటు అమెరికాలో ఉండి.. నాలుగు రోజుల క్రితమే వచ్చాను. అక్కడ జాబ్ మార్కెట్ బాగా లేదు. ఉత్తమ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే ఇంటర్న్షిప్లు వస్తున్నాయి.. అలాంటివారికే ఉద్యోగాలు కూడా వస్తాయని నాకు అర్థమైంది' అని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ప్రాంగణ నియామకాల విభాగం సంచాలకుడు పార్థసారథి చెప్పారు. కృత్రిమ మేధ ప్రభావంతో ఎంట్రీ, మధ్యస్థాయి ఉద్యోగాలను ఆయా కంపెనీలు తగ్గించుకుంటున్నాయని.. మన విద్యార్థులు నైపుణ్యాలను మరింత పెంచుకోక తప్పదని సూచించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #Indian #Students #NewVisaRules #VisaInterviews #USAStudies #IndiaStudents #NewStudentVisaRulesChange
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.